1)మీనరాశి నుండి మిధునరాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి "బాల్య జీవితం" బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.
2)కర్కాటకరాశి నుండి తులా రాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి "యవ్వన జీవితం " బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.
3)వృశ్చికం రాశి నుండి కుంభ రాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి " వృద్దాప్య జీవితం " బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.
ఉదాహరణ జాతకచక్రంలోని సర్వాష్టక బిందువులు:-
1)మీన రాశి, మేషరాశి, వృషభరాశి, మిధునరాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-21+28+30+36=115.
2)కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-35+26+26+20=107.
3)వృశ్చికరాశి, ధనస్సురాశి, మకరరాశి, కుంభరాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-30+27+27+31=115.
బాల్యదశ లో సర్వాష్టక బిందువులు:-115
యవ్వనదశ లో సర్వాష్టక బిందువులు:-107.
వృద్దాప్యదశ లో సర్వాష్టక బిందువులు:-115.
పై జాతకచక్రంలోని సర్వాష్టక బిందువులను పరిశీలించగా బాల్యదశలో 115, యవ్వనదశ లో 107, వృద్దాప్యదశ లో 115 బిందువులు ఉన్నాయి.
కాబట్టి జాతకుడు యవ్వనదశ లో కంటే బాల్యదశ, వృద్దాప్యదశలో ఆనందకరమైన, సుఖ సౌఖ్యాలు కలిగిన జీవితాన్నిఅనుభవిస్తాడు అని తెలుసుకోవచ్చును.
Post a Comment